
సిక్కుల మత గురువు గురునానక్ 550వ జయంతి సందర్భంగా ఆయన స్మారక నాణేన్ని పాకిస్థాన్ ప్రభుత్వం విడుదల చేసింది. 50 రూపాయలు విలువైన ఈ నాణెంతో పాటు, రూ.8 విలువ చేసే పోస్టల్ స్టాంప్ కర్తార్పూర్ సాహిబ్లో యాత్రికులకు అందుబాటులో ఉంచుతారని దునియా న్యూస్ తెలిపింది. కాగా, పాకిస్థాన్లోని కర్తార్పూర్ కారిడార్ ద్వారా గురుద్వారా కర్తార్పూర్ సాహిబ్కు వెళ్లే 575 మంది తొలి విడత యాత్రికుల జాబితాను పాక్కు భారత్ అందజేసింది. కర్తార్పూర్ వెళ్లే తొలి బృందం నవంబర్ 9న పాక్కు బయలుదేరుతుంది.