రాష్ట్ర సమస్యలను కేంద్రం దృష్టికి తీసుకెళ్లానని చెబుతున్న సీఎం జగన్ ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం ఎన్ని డిమాండ్లకు అంగీకారం తెలిపిందో చెప్పాలని సీపీఐ సీనియర్ నాయకుడు రామకృష్ణ డిమాండ్ చేశారు. సీఎంకు ఢిల్లీలో ఓ ఎంపీకి ఇచ్చిన విలువ కూడా ఇవ్వడం లేదని ఆయన ఎద్దేవా చేశారు. ఢిల్లీ పర్యటన వివరాలు గోప్యంగా ఉంచడం వల్ల రాష్ట్రానికి తీవ్ర అన్యాయం చేసిన వారవుతారని అన్నారు. సీఎం అఖిలపక్ష భేటీ నిర్వహించి ఢిల్లీ పర్యటన వివరాలు వెల్లడించాలని ఆయన చెప్పారు. రాష్ట్రంలో కక్షపూరిత రాజకీయం నడుస్తోందన్నారు. రైతులకు తీరని అన్యాయం చేస్తున్నారని, రైతులను కులాల వారీగా విభజించి వారికీ పైసలు రాకుండా చేస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు విభజన సమస్యలు ఓ దశకు రాలేదన్నారు. ప్రత్యేక హోదాపై జగన్ ఎందుకు వెనకడుగు వేస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. రాష్ట్ర భవిష్యత్ను అంధకారంలోకి నెట్టొందన్నారు.