
ఈ సంక్రాంతి కానుకగా విడుదలైన 'సరిలేరు నీకెవ్వరు' రూపంలో సూపర్ స్టార్ మహేష్ బాబు తన అతిపెద్ద హిట్ సాధించాడు. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అని ప్రచారం చేసిన ఈ చిత్రం మహేష్ బాబు యొక్క మాస్ సైడ్ ని చూపించి అభిమానులను థ్రిల్ చేసింది. మహేష్ బాబు తదుపరి సినిమా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఉంటుందని సరిలేరు నీకెవ్వరు సమయంలో వెల్లడించారు. అయితే గత కొద్ది రోజులుగా వచ్చిన తాజా సమాచారం ఏమిటంటే, ఈ ప్రాజెక్ట్ నిలిపేసి, మహేష్ పరుశురాం ప్రాజెక్ట్ను పట్టలేకించనున్నారు. పరశురాం గతేడాది మహేష్తో కలిసి పనిచేయాల్సి ఉన్నప్పటికీ అది స్పష్టమైన కారణాల వల్ల వాయిదా పడింది. ఇప్పుడు తాజా అప్డేట్ ప్రకారం, పరుశురాం డైరెక్షన్ లో మహేష్ తదుపరి సినిమా జూలై నెలలో ప్రారంభమవుతుంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ ప్రాజెక్టును నిర్మించనున్నారు. ఈ చిత్రం యొక్క మెజారిటీ షూట్ యుఎస్ లో జరుగుతుంది. ఈ చిత్రానికి గోపి సుందర్ మ్యూజిక్ కంపోజ్ చేయనున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ కమర్షియల్ ఎంటర్టైనర్ కి మాధీ సినిమాటోగ్రాఫర్ బాద్యతలు చేపట్టారు.