
ఈమధ్యకాలంలో బయోపిక్ల హవా నడుస్తున్న విషయం తెల్సిందే. మొన్నీమధ్యే ఎన్టీఆర్ బయోపిక్, మల్లేశం, వంగవీటి, జార్జ్ రెడ్డి లాంటి బయోపిక్స్ వచ్చాయి. ఇప్పుడు తమిళనాడు ప్రజలు అమ్మగా భావించే దివంగత ముఖ్యమంత్రి జయలలిత జీవిత చరిత్రను తెరకెక్కిస్తున్న సంఘటగి తెలిసిందే. అయితే జయలలిత బయోపిక్ ను ఇద్దరు, ముగ్గురు తెరకెక్కిస్తుండగా అందులో ఒకరు విజయ్. విజయ్ దర్శకత్వంలో వస్తున్న "తలైవి" చిత్రంలో కంగనా రనౌత్ జయలలిత పాత్రను పోషిస్తుంది. ఎంజీఆర్ పాత్రలో అరవింద్ స్వామి కనిపించనున్నాడు. ఎన్టీఆర్ పాత్ర కోసం జూ. ఎన్టీఆర్ ను సంప్రదిస్తున్నారు. కాగా సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కంగనా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా శనివారం రిలీజ్ చేసింది. జయలలిత లాగా కనిపించడం కోసం కంగనా అమెరికాలో మేకప్ టెస్ట్ చేయించుకుందట. అలానే భరతనాట్యం కూడా నేర్చుకుందట. అంతేకాకుండా బరువు పెరిగేందుకు తగిన ఆహారం తీసుకోవడంతో పాటు లైట్ డ్రగ్స్ కూడా తీసుకుందట. ఈ సినిమాను 2020 జూన్ 26న విడుదల చేయనున్నారు.