
మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. గతంలో కరోనా.. లాక్ డౌన్ కారణంగా ఈ చిత్రం షూటింగ్ వాయిదాపడుతూ వచ్చింది. కథ రీత్యా మొదట్లో తొలి షెడ్యూలును అమెరికాలో నిర్వహించాలనుకున్నారు. అయితే, కరోనా నేపథ్యంలో వర్క్ పర్మిట్లు రావడంలో ఇబ్బందులు ఎదురవడంతో అమెరికా షెడ్యూలును వాయిదా వేసుకున్నారు. ఈ క్రమంలో తొలి షెడ్యూలును హైదరాబాదులోనే ప్రారంభిస్తారంటూ ఇటీవల వార్తలొచ్చాయి. అయితే, తాజాగా, తొలి షెడ్యూలును దుబాయ్ లో నిర్వహించడానికి దర్శక నిర్మాతలు నిర్ణయించినట్టు తెలుస్తోంది. ఈ నెల 25 నుంచి దుబాయ్ లో షెడ్యూలు జరుగుతుందని అంటున్నారు. సుమారు ఇరవై రోజుల పాటు అక్కడే ఈ షెడ్యూలు కొనసాగుతుంది. అనంతరం రెండో షెడ్యూలు షూటింగును హైదరాబాదులో నిర్వహిస్తారని సమాచారం.
Tags: #Cinecolorz #maheshbabu #Tollywood