
విజయ్ దేవరకొండ, రష్మీక మందన్న జంటగా తెరకెక్కిన చిత్రం "గీత గోవిందం" ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. దీంతో ఆ సినిమాకు దర్శకత్వం వహించిన యంగ్ డైరెక్టర్ పరుశురాం తదుపరి చిత్రంపై రోజుకో పుకారు పుట్టుకొచ్చింది. విజయ్ దేవరకొండ తర్వాత కచ్చితంగా పెద్ద హీరోతోనే చేయాలని ఫిక్స్ అయ్యి కధ రెడీగా ఉన్నా స్టార్ హీరోల డేట్ల కోసం వెయిట్ చేస్తూ వాళ్ళ చుట్టూ తిరిగిన పరుశురాం ఇక వాళ్ళ డేట్లు ఇప్పట్లో కష్టమని అర్థమై వేరే హీరోకి షిఫ్ట్ అయ్యాడు. అతను మరెవరో కాదు అక్కినేని యంగ్ హీరో నాగచైతన్య. ఈ సినిమాను 14రిల్స్ నిర్మించనుంది. అయితే, ఈ సినిమాకు సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ ప్రస్తుతం సినీ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ సినిమాకు "నాగేశ్వరరావు" అనే టైటిల్ ను పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ టైటిల్ గనుక పెడితే అక్కినేని అభిమానులందరూ ఆనందంలో మునిగితేలడంతో పాటు అదే స్థాయిలో అంచనాలు కూడా నెలకుంటాయి. మరి టైటిల్ పై చిత్ర బృందం ఏ నిర్ణయం తీసుకోనుందో వేచి చూడాలి.