
ఆయుష్మాన్ ఖుర్రానా నటించిన 'అందాదున్' మూడు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ప్రస్తుతం, తన తాజా చిత్రం 'భీష్మ' విజయాన్ని ఆస్వాదిస్తున్న హీరో నితిన్ తదుపరి సినిమాగా ఈ చిత్ర రీమేక్ చేయనున్నారు. శ్రీలత్ మూవీస్ బ్యానర్లో ఎన్ సుధాకర్ రెడ్డి, నికితా రెడ్డి నిర్మించనున్న ఈ చిత్రాన్నికి మెర్లాపాక గాంధీ దర్శకత్వం వహించనున్నారు. ఠాగూర్ మధు ఈ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు. ఈ రోజు, ఫిల్మ్ యూనిట్ మరియు ప్రత్యేక అతిథుల సమక్షంలో అధికారిక ముహూర్తం వేడుకతో 'అందాదున్' రీమేక్ ప్రారంభమైంది. నిర్మాత చిన్న బాబు స్క్రిప్ట్ను మేకర్స్కు అందజేశారు. క్లాప్ బోర్డ్ శ్యామ్ ప్రసాద్ రెడ్డి కొట్టగా, కెమెరాను దిల్ రాజు స్విచ్ ఆన్ చేశారు. మొదటి షాట్కు సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించారు. హరి కె వేదాంత్ సినిమాటోగ్రాఫర్ గా చేయనున్నారు మరియు మేకర్స్ త్వరలో ఈ చిత్రంలో హీరోయిన్, ఇతర వివరాలను ప్రకటించనున్నారు. ఈ ఏడాది జూన్ నుంచి చిత్రీకరణ ప్రారంభమవుతుంది.