
మంచు మనోజ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ప్రతిభావంతులైన నటులలో ఒకరు. అతను చివరిసారిగా 2017లో విడుదలైన 'ఒక్కడు మిగలాడు' అనే యాక్షన్ డ్రామాలో కనిపించాడు. ఈ చిత్రాన్నీకి అజయ్ ఆండ్రూస్ మరియు అజయ్ నూతక్కి దర్శకత్వం వహించగా, ఎస్ ఎన్ రెడ్డి మరియు హెచ్ లక్ష్మీకాంత్ రెడ్డి నిర్మాణ బాధ్యతలు వహించారు. కానీ దురదృష్టవశాత్తు ఒక్కడు మిగిలాడు చిత్రం బాక్సాఫీస్ వద్ద వాణిజ్యపరంగా విఫలమైంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మంచు మనోజ్ మరో ప్రాజెక్టుకు సంబంధించి అధికారిక ప్రకటన చేయలేదు. ఈ ఏడాది జనవరి నెలలో, మంచు మనోజ్ తన అభిమానులకు, అతి త్వరలో తన రాబోయే చిత్రం గురించి వివరాలను వెల్లడిస్తానని మాట ఇచ్చాడు. జనవరిలో, మంచు మనోజ్ ట్వీటర్ లో, "నేను ఒక వారంలోనే ఆసక్తికరంగా ఒకదాని గురించి ప్రకటిస్తానని" పోస్ట్ చేసాడు.