
దిశ నిందితుల ఎంకౌంటర్ పై దేశం మొత్తం హర్షం వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి సైతం జరిగిన ఎంకౌంటర్ పై తన స్పందనను తెలియజేశారు. "దిశ సంఘటనలో నిందితులు పోలీసు కాల్పుల్లో మృతిచెందారన్న వార్తను ఉదయం చూడగానే నిజంగానే ఇది సత్వర న్యాయం, సహజ న్యాయం అని నేను భావించాను. కామంతో కళ్లు ముసుకపోయి ఇలాంటి నేరాలు, ఘోరాలు చేసే ఎవరికైనా ఇది కనువిప్పు కలిగించాల్సిందే. అత్యంత దారుణంగా అత్యాచారానికి గురైన దిశ ఆత్మకు శాంతి చేకూరినట్లయింది. కడుపుకోతతో బాధపడుతున్న దిశ తల్లిదండ్రుల ఆవేదనకు ఊరట లభించినట్లయింది. దారుణాలకు పాల్పడే మానవ మృగాలకు ఇది గుణపాఠం కావాలి. వారం రోజుల వ్యవధిలోనే ఈ వ్యవహారం కొలిక్కి రావడం అభినందనీయం. పోలీస్ వ్యవస్థకి, కేసీఆర్ గారి ప్రభుత్వానికి నా అభినందనలు తెలియజేస్తున్నాని" అన్నారు చిరంజీవి.