
కరోనా వైరస్ వల్ల కలిగే కోవిడ్ -19 గురించి ప్రపంచవ్యాప్తంగా తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. ఏఎఫ్పి గణాంకాల ప్రకారం, చైనా 17 కొత్త మరణాలను నివేదించింది. వైరస్ వ్యాప్తి చెందడంతో ఈ సంఖ్య 4,011 కు చేరుకుంది. ఇది 100 దేశాలకు వ్యాపించి, 110,000 కంటే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. భారతదేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య సోమవారం 46కి చేరుకుంది. పూణేలో ఇద్దరు మరియు కేరళ ఎర్నాకుళంలో ఒకరు, ఢిల్లీ, ఉత్తర్ ప్రదేశ్, అమృత్సర్ మరియు జమ్మూ నుండి ఒక్కొక్కరు కరోనా వైరస్ భారిన పడ్డారు. ఇప్పుడు తాజా సమాచారం ప్రకారం, యంగ్ అండ్ హ్యాపెనింగ్ హీరో విజయ్ దేవరకొండతో, ప్రజలకు అవగాహన కల్పించే అవగాహన కార్యక్రమాన్ని రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ ప్రభుత్వం విజయ్ దేవరకొండతో ఒక అవగాహన ప్రకటనను చిత్రీకరించింది. ఇది అతి త్వరలో టీవీలో ప్రసారం కానుంది. దక్షిణ భారత చిత్ర పరిశ్రమలో ఎక్కువగా ఫాలోయింగ్ ఉన్న హీరో కావడంతో, విజయ్ దేవరకొండతో ప్రకటన ప్రభావవంతంగా ఉంటుందని ప్రభుత్వం భావించింది.