Shrasti Verma:టాలీవుడ్ పరిశ్రమలో ఇప్పటికే చాలామంది సెలబ్రిటీలు, డైరెక్టర్స్, నిర్మాతలు సైతం పొలిటికల్ పరంగా ఎంట్రీ ఇచ్చారు. అయితే ఇప్పుడు తాజాగా ఒక లేడీ కొరియోగ్రాఫర్ పొలిటికల్ ఎంట్రీ ఇవ్వడంతో ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ఇప్పుడిప్పుడే డాన్స్ మాస్టర్ గా ఇండస్ట్రీలో ఎదుగుతున్న ఈమె రాజకీయ ఎంట్రీ ఇవ్వడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఆ లేడీ కొరియోగ్రాఫర్ ఎవరో కాదు శ్రష్టి వర్మ. ఆగస్టు 17న బిజెపి పార్టీలో చేరారు. ఇందుకు సంబంధించి సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేస్తూ బిజెపి పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర రావు కండువా కప్పి మరి పార్టీలోకి ఆహ్వానించిన వీడియోని షేర్ చేసింది.
పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన శ్రష్టి వర్మ..
శ్రష్టి వర్మ(Shrasti Verma) ఉత్తరప్రదేశ్ లోని ఇటావా పట్టణంలో జన్మించారు. ఢీ డాన్స్ షో ద్వారా మంచి గుర్తింపు సంపాదించుకున్న శ్రష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్ దగ్గర కొంతకాలం ఈమె అసిస్టెంట్ గా కూడా పనిచేశారు. అనంతరం సొంతంగా కొన్ని సినిమాలకు డాన్స్ కొరియోగ్రాఫర్ గా చేసి మరీ పేరు సంపాదించుకుంది. అలా అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోల చిత్రాలకు పని చేసిన ఈమె పుష్ప 2 సినిమాలో కూడా “సూసేకి” అనే పాటకి కొరియోగ్రాఫర్ గా చేయడంతో మంచి పేరు సంపాదించుకుంది.
also read:OTT:కొరియన్ కనకరాజు”కు అదిరిపోయే ఓటీటీ డీల్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
గతంలో జానీ మాస్టర్ పై ఆరోపణలు..
ఈ క్రేజీతోనే తెలుగు బిగ్ బాస్ సీజన్ 9 లో ఎంట్రీ ఇచ్చింది శ్రష్టి వర్మ . అందులో మొదటి ఎలిమినేషన్ లోనే హౌస్ నుంచి బయటికి వచ్చేసింది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తోంది. ఇప్పుడు బిజెపి పార్టీలోకి చేరడంతో మరోసారి వార్తలలో నిలుస్తోంది శ్రష్టి వర్మ. గడిచిన కొద్ది నెలల క్రితం శ్రష్టి వర్మ ప్రముఖ కొరియోగ్రాఫర్ గా పేరు సంపాదించిన జానీ మాస్టర్ పైన లైంగిక ఆరోపణలు చేయడంతో జాతీయస్థాయిలో ఈ విషయం పెద్ద ఎత్తున చర్చ జరిగింది. జానీ మాస్టర్ పైన ఫోక్సో కేస్ కూడా నమోదయింది. అంతే కాకుండా జానీ మాస్టర్ జైలుకు వెళ్లి బెయిల్ మీద వచ్చారు. అంతేకాకుండా జనసేన పార్టీ నుంచి జానీ మాస్టర్ ని సస్పెండ్ కూడా చేశారు. ఆ తర్వాత కూడా పలు రకాల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా పనిచేస్తున్నారు.
also read:Nagababu:ఏపీ గ్రీన్ ఛైర్మన్గా నాగబాబు.. రాష్ట్ర భవిష్యత్తుపై కీలక వ్యాఖ్యలు!
జానీ మాస్టర్ పై ఆగని శ్రష్టి వర్మ ఆరోపణలు..
జానీ మాస్టర్ జైలు నుంచి బయటికి వచ్చిన అనంతరం కూడా అప్పుడప్పుడు పలు రకాల ఇంటర్వ్యూలలో శ్రష్టి వర్మ తిరిగి ఆరోపణలు చేస్తూనే ఉంది. అయితే ఆ వార్తలకు మాత్రం అంతగా ప్రాధాన్యత లభించలేదు. ఈ నేపథ్యంలోని ఈమె బీజేపీలోకి చేరడం ఇప్పుడు మరొకసారి ఈమె పేరు వినిపించడంతో.. మరి పొలిటికల్ పరంగా ఎలాంటి పాత్ర పోషిస్తుంది అనే విషయంపై అందరూ ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు.
View this post on Instagram




