Tuesday, July 14, 2026
HomeLATESTOTT:ఓటీటీలోకి వస్తున్న 'వంద దేవుళ్లు'..విజయ్ ఆంటోనీ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:ఓటీటీలోకి వస్తున్న ‘వంద దేవుళ్లు’..విజయ్ ఆంటోనీ ఎమోషనల్ డ్రామా స్ట్రీమింగ్ ఎప్పుడంటే?

OTT:విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ఎమోషనల్ డ్రామా 'వంద దేవుళ్లు' త్వరలో ఓటీటీలోకి రానుంది. థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం జూలై చివరి వారం నుంచి Zee5లో స్ట్రీమింగ్ కానుందని సమాచారం.

on
- Advertisement -banner Ad

OTT:బిచ్చగాడు’ వంటి సూపర్ డూపర్ హిట్ తర్వాత హీరో విజయ్ ఆంటోనీ, దర్శకుడు శశి కాంబినేషన్‌లో వచ్చిన ప్రతిష్టాత్మకమైన చిత్రం ‘వంద దేవుళ్లు’. తమిళంలో ‘నూరు సామి’ పేరుతో విడుదలైన ఈ సినిమా జూన్ 19న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాక్సాఫీస్ వద్ద మంచి హిట్ టాక్ సంపాదించుకుంది. భారీ వసూళ్లు సాధించకపోయినా, తన భావోద్వేగభరితమైన కథతో ప్రేక్షకులను, విమర్శకులను ఆకట్టుకుని మంచి ప్రశంసలు అందుకుంటోంది. విజయ్ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై విజయ్ ఆంటోనీ, రామాంజనేయులు, శివాజీ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మించారు. విజయ్ ఆంటోనీతో పాటు స్వాసిక, అజయ్ ధీశన్, లిజో మోల్ జోస్, శక్తి, కావ్య తదితరులు కీలక పాత్రలు పోషించారు.

ALSO READ:Lenin:’లెనిన్’తో మార్మోగుతున్న ప్రమోద్ పంజు పేరు.. ‘ఆపమని చెప్పన్నా’ నటుడికి ఇదే అసలైన బ్రేక్..!

- Advertisement -
Advertisement

ఓటీటీ రిలీజ్‌కు సిద్ధం

థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి స్పందన పొందిన ‘వంద దేవుళ్లు’ ఇప్పుడు ఓటీటీలోకి రానుంది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ (OTT)సంస్థ జీ5(ZEE5) సొంతం చేసుకుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం, జూలై చివరి వారంలో లేదా ఆగస్టు తొలి వారంలో ఈ సినిమా స్ట్రీమింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉంది. దీనికి సంబంధించిన అధికారిక విడుదల తేదీని త్వరలోనే మేకర్స్ ప్రకటించనున్నారు.

ALSO READ:Tejaswini:సాయి పల్లవి హిట్ పాటకు బాలయ్య చిన్న కూతురు అదిరే డ్యాన్స్.. వీడియో వైరల్!

- Advertisement -
Advertisement

కథలోని ప్రధాన భావోద్వేగం ఇది

ఈ సినిమా కథ సమాజంలో ఇప్పటికీ చర్చనీయాంశంగా ఉన్న ఒక సున్నితమైన అంశాన్ని సూచిస్తుంది. భర్తను చిన్న వయసులోనే కోల్పోయిన వాసవి (స్వాసిక) తన ఇద్దరు కుమారులను ఎన్నో కష్టాలు పడుతూ ఒంటరిగా పెంచుతుంది. ఒంటరి మహిళ కావడంతో సమాజం నుంచి అవమానాలు, అనుచిత ప్రవర్తనలు కూడా ఎదుర్కొంటుంది. పిల్లల కోసం జీవితాన్ని అంకితం చేసిన వాసవి తన జీవితానికి మరో అవకాశం ఇవ్వాలని నిర్ణయించుకుని మళ్లీ పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. అయితే ఆమె పెద్ద కుమారుడు ఈ నిర్ణయాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తాడు. అలాంటి పరిస్థితుల్లో ఆమె జీవితంలోకి ఏడుకొండలు (విజయ్ ఆంటోనీ) ప్రవేశిస్తాడు. ఆ తర్వాత జరిగే సంఘటనలు, కుటుంబ సంబంధాలు, తల్లి మనసు, సమాజం చూపే దృక్పథం చుట్టూ ఈ కథ భావోద్వేగంగా కొనసాగుతుంది. తల్లి జీవితానికి రెండో అవకాశం ఉండాలనే సందేశాన్ని హృదయానికి హత్తుకునే విధంగా చెప్పిన ఈ చిత్రం కుటుంబ ప్రేక్షకులకు మంచి అనుభూతిని అందించే ఎమోషనల్ డ్రామాగా నిలిచింది.

- Advertisement -
Advertisement

Related articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0FollowersFollow
0SubscribersSubscribe

Latest posts

- Advertisement -banner Ad

You might also likeRELATED
Recommended to you