OTT:సినిమా పరిశ్రమలో ప్రతి చిత్రం అనుకున్న సమయానికి ప్రేక్షకుల ముందుకు రావడం సాధ్యం కాదు. కొన్ని సినిమాలు విడుదలకు సిద్ధమైన తర్వాత కూడా అనేక కారణాలతో సంవత్సరాల పాటు నిలిచిపోతుంటాయి. అలాంటి పరిస్థితినే బాలీవుడ్ నటి మృణాల్ ఠాకూర్ ప్రధాన పాత్రలో నటించిన ‘పూజా మేరీ జాన్’ చిత్రానికి ఎదురైంది. 2022లోనే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పటివరకు థియేటర్లలో విడుదల కాలేదు.
హాట్స్టార్ నుంచి జీ5 చేతికి హక్కులు :
మొదట ఈ సినిమా డిజిటల్ హక్కులను డిస్నీ+ హాట్స్టార్సొం (OTT)తం చేసుకుంది. అయితే తర్వాత జియో-డిస్నీ విలీనం వంటి పరిణామాల నేపథ్యంలో పలువురు ప్రాజెక్టుల మాదిరిగానే ఈ సినిమా విడుదల కూడా వాయిదా పడింది. దీంతో సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకు వస్తుందనే విషయంపై స్పష్టత లేకపోయింది. తాజాగా జీ5 ఈ చిత్రం డిజిటల్ హక్కులను దక్కించుకున్నట్లు అధికారికంగా ప్రకటించింది. అయితే విడుదల తేదీని మాత్రం ఇంకా వెల్లడించలేదు.
ALSO READ:NBK 111: హీరో బాలకృష్ణకు గాయాలు.. ఇప్పుడు ఎలా ఉందంటే?
థ్రిల్లర్ కథతో ఆసక్తి:
నవజ్యోత్ గులాటి దర్శకత్వం వహించిన ఈ చిత్రం సైకలాజికల్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కింది. మృణాల్ ఠాకూర్తో పాటు హుమా ఖురేషీ కీలక పాత్రలో నటించారు. ఆధునిక కాలంలో సోషల్ మీడియా, ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఇంటర్నెట్ ద్వారా జరిగే డిజిటల్ వేధింపులను ప్రధాన అంశంగా తీసుకుని కథను రూపొందించినట్లు సమాచారం. ఈ చిత్రంలో పూజ అనే యువతి గుర్తు తెలియని వ్యక్తి నుంచి వరుస ఫోన్ కాల్స్, సందేశాలు, ఆన్లైన్ వేధింపులను ఎదుర్కొంటుంది. ఆ మానసిక ఒత్తిడి ఆమె వ్యక్తిగత జీవితాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. తనను వేధిస్తున్న వ్యక్తి ఎవరు? ఆ ఉచ్చులో నుంచి పూజ ఎలా బయటపడింది? చివరకు నిజం ఎలా బయటపడింది? అనే అంశాల చుట్టూ కథ సాగనుందని తెలుస్తోంది.
ALSO READ:Naga Chaitanya:నాగార్జున కెరీర్ సక్సెస్కు కారణం ఇదే.. చైతన్య చెప్పిన ఆసక్తికర విషయం!
ఓటీటీ ప్రేక్షకుల్లో పెరిగిన ఆసక్తి:
ఎన్నో సంవత్సరాలుగా విడుదల కోసం ఎదురుచూస్తున్న ‘పూజా మేరీ జాన్’ చివరకు ఓటీటీ వేదికపై ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. థియేటర్లను దాటేసి నేరుగా డిజిటల్ ప్లాట్ఫారమ్లో విడుదల కానున్న ఈ చిత్రంపై థ్రిల్లర్ సినిమాలను ఇష్టపడే ప్రేక్షకుల్లో ఆసక్తి నెలకొంది. విడుదల తేదీపై జీ5 త్వరలో అధికారిక ప్రకటన చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




