Sushmitha Konidela:పవన్ కళ్యాణ్ పాలిటిక్స్లోకి వచ్చాక మెగా కుటుంబానికి సంబంధించిన ఒక్కొక్కరు పాలిటిక్స్లోకి ఎలా ఎంట్రీ ఇస్తున్నారు అనేది చూస్తూనే వచ్చాం. అటు సినిమాల పరంగా మెగా కుటుంబం ఎంత యాక్టివ్ గా ఉన్నప్పటికీ రాజకీయాలలో కూడా జనసేన పార్టీకి సంబంధించి అంతే యాక్టివ్ గా ఉన్నట్టు కనిపిస్తోంది. ఇటీవలే నాగబాబుకు కూడా ఒక కీలకమైన పదవి ఇచ్చారు. ఇప్పుడు తాజాగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డు ప్రత్యేక ఆహ్వానితురాలిగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసినట్లు వార్తలు బాగా వైరల్ అవుతున్నాయి.ఈ విషయం ఎంతవరకు నిజమో తెలియదు కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో ఈ న్యూస్ బాగా హీట్ పెంచేస్తుంది.
దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డులో సుస్మిత :
విజయదుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు ప్రత్యేక ఆహ్వానితురాలిగా చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెలను(Sushmitha Konidela) దేవదాయ శాఖ కార్యదర్శి కన్నబాబు నియమించినట్లు తెలుస్తుంది. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ న్యూస్ బాగా హీట్ పెంచేస్తుంది. దీనిపై ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తున్నారు.
also read:Bigg Boss Telugu 10: రెండో రోజే రచ్చ..ఈ కంటెంస్టెంట్ బాగా ఓవర్ చేస్తున్నాడే..!
సోషల్ మీడియాలో భిన్న స్పందనలు :
కొంతమంది పవన్ కళ్యాణ్ కూడా పాలిటిక్స్లోకి వచ్చి కుటుంబ ప్రయోజనాల కోసమే చూసుకుంటున్నారని నెగెటివ్గా మాట్లాడుతున్నారు. మరికొంతమంది మాత్రం ఆమెకు అదృష్టం అలా కలిసి వచ్చింది.. సుస్మిత మంచి నిర్ణయాలు తీసుకుంటే బాగుంటుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ఇంద్రకీలాద్రిపై అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలు, అదేవిధంగా ఆలయ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమాలు మరియు ప్రత్యేక ఉత్సవాలలో చిరంజీవి కుమార్తె సుస్మిత కొణిదెల భాగస్వామై తగిన సూచనలు, సలహాలు అందించనున్నట్లు తెలుస్తుంది.
also read:Toxic:బాక్సాఫీస్లో బిగ్ డిజాస్టర్.. ఓటీటీలోకి వచ్చేస్తున్న యశ్ ‘టాక్సిక్’!
సుస్మితకు బాధ్యతలు ఇవ్వడంపై నెగెటివ్ కామెంట్స్ :
అయితే దీనిపై సోషల్ మీడియాలో హ్యూజ్ నెగెటివ్ టాక్ వినిపిస్తుంది. ఆమెకు ఎందుకు ఇలాంటి బాధ్యతలు అప్పగించారు? దీని వెనక ఎవరున్నారు? కూటమి ప్రభుత్వం ఏమి చేస్తుంది? అంటూ రకరకాలుగా నెగెటివ్గా స్పందిస్తున్నారు.సోషల్ మీడియాలో ఇప్పుడు సుస్మిత కొణిదెలకు విజయవాడ దుర్గమ్మ ఆలయ ట్రస్ట్ బోర్డుకు సంబంధించిన ప్రత్యేక బాధ్యతలు ఇవ్వడం హీట్ పెంచేస్తుంది.
రేపు ఇంకెవరు అంటూ మీమ్స్ :
చూడాలి మరి దీనిపై మెగా ఫ్యామిలీ కానీ, సుస్మిత కానీ, జనసేన సభ్యులు కానీ ఎవరైనా స్పందిస్తారా అనేది. సోషల్ మీడియాలో మాత్రం ఈ వ్యవహారం బాగా హీట్ పెంచేస్తుంది. మొన్న నాగబాబు.. ఇప్పుడు సుస్మిత.. రేపు ఇంకెవరు? మెగా ఫ్యామిలీ మొత్తం పాలిటిక్స్లోకి వచ్చేస్తుందా? అంటూ మీమ్స్ ట్రెండ్ చేస్తున్నారు.




