Agnipariksha 2:బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లోకి కామనర్లను ఎంపిక చేసే ప్రక్రియలో భాగంగా నిర్వహిస్తున్న ‘అగ్నిపరీక్ష 2’(Agnipariksha 2) ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. షో మొదలైన కొద్దిరోజుల్లోనే కంటెస్టెంట్ల ఎంపికతో పాటు అక్కడ చోటుచేసుకున్న కొన్ని పరిణామాలు తీవ్ర చర్చకు దారితీశాయి. ముఖ్యంగా ఉప్పల్ బాలు, రన్నింగ్ రాజా సహా పలువురు కంటెస్టెంట్లను జడ్జెస్, యాంకర్ శ్రీముఖి వ్యవహరించిన తీరు సోషల్ మీడియాలో విమర్శలకు కారణమైంది. ఈ వ్యవహారంపై నెటిజన్లు పెద్ద ఎత్తున స్పందించడంతో వివాదం మరింత ముదిరింది. ఈ క్రమంలో నవదీప్ సైతం పరోక్షంగా దీనిపై స్పందించాల్సి వచ్చింది.
తాజాగా ఈ మొత్తం వ్యవహారంపై బిగ్ బాస్ తెలుగు సీజన్ 2 విజేత కౌశల్ మందా చేసిన వ్యాఖ్యలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. బిగ్ బాస్ షోలో పాల్గొనే వారి ఉద్దేశాలు, కామనర్ల ఎంపిక వెనుక ఉన్న కారణాలపై ఆయన తన అభిప్రాయాలను వెల్లడించారు.
బిగ్ బాస్కు వెళ్లేది మెసేజ్ ఇవ్వడానికి కాదు:
బిగ్ బాస్ హౌస్లోకి అడుగుపెట్టే ప్రతి ఒక్కరూ సమాజానికి ఏదో ఒక గొప్ప సందేశాన్ని అందించాలనే ఉద్దేశంతో వెళ్లరని కౌశల్ పేర్కొన్నారు. కొందరు ఆర్థికంగా ప్రయోజనం పొందేందుకు షోలో పాల్గొంటే.. మరికొందరు వినోదం, పాపులారిటీ కోసం వస్తారని తెలిపారు. సమాజానికి ఉపయోగపడే సందేశం ఇవ్వాలని నిజంగా ప్రయత్నించే వారు చాలా తక్కువమంది మాత్రమే ఉంటారని ఆయన అభిప్రాయపడ్డారు.
also read:Varanasi:రాజమౌళి మరో సంచలనం.. 50 భాషల్లో ఒకేసారి ‘వారణాసి’ రిలీజ్..!
ఫన్, డబ్బు.. ఇదే అసలు లక్ష్యం:
బిగ్ బాస్ను ప్రధానంగా ఎంటర్టైన్మెంట్ ప్లాట్ఫామ్గానే చూడాలని కౌశల్ అన్నారు. షో ద్వారా డబ్బు సంపాదించడం, గుర్తింపు తెచ్చుకోవడం లేదా తమకు ఉన్న పాపులారిటీని మరింత పెంచుకోవడం వంటి కారణాలతో చాలామంది ఇందులోకి వస్తారని చెప్పారు. కాబట్టి కంటెస్టెంట్లు సమాజాన్ని మార్చే లక్ష్యంతోనే హౌస్లోకి వెళ్తున్నారని భావించడం సరికాదని స్పష్టం చేశారు.
also read:Nithya Menon:ఫైనల్లీ..నిత్యా మీనన్ పెళ్లికి చేసుకోబోతుందోచ్..? అబ్బాయి ఎవరంటే..?
కామనర్ల ఎంపిక వెనుక ఓట్ల లెక్క? :
బిగ్ బాస్లో సామాన్యులను తీసుకురావడం వెనుక కూడా ఒక వ్యూహం ఉందని కౌశల్ అభిప్రాయపడ్డారు. కామనర్లకు సాధారణ ప్రేక్షకుల్లో ఉండే ఆదరణ, వారి ద్వారా లభించే ఓటింగ్ ప్రభావాన్ని దృష్టిలో పెట్టుకునే వారిని ఎంపిక చేస్తున్నారని వ్యాఖ్యానించారు. షో నిర్వాహకులకు, సెలబ్రిటీలకు తమకు అనుకూలంగా వ్యవహరించే స్వేచ్ఛ ఉంటుందని.. అలాంటి పరిణామాలను చూసి ప్రేక్షకులు లేదా కంటెస్టెంట్లు అతిగా స్పందించాల్సిన అవసరం లేదని సూచించారు.
‘కూల్గా ఉండండి’.. కౌశల్ సలహా:
అగ్నిపరీక్షలో జరుగుతున్న పరిణామాలను చూసి ఎవరూ ఎక్కువగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదని కౌశల్ పేర్కొన్నారు. ‘కూల్గా, ఈజీగా’ తీసుకోవాలని సూచించారు. చివరికి అగ్నిపరీక్ష 2 నుంచి ఎవరు బిగ్ బాస్ తెలుగు సీజన్ 10 ప్రధాన హౌస్లోకి అడుగుపెడతారన్నదే ఆసక్తికరంగా మారిందని ఆయన వ్యాఖ్యల ద్వారా స్పష్టమవుతోంది. కౌశల్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
View this post on Instagram




